శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
భూమి గుండ్రంగా ఉందన్నది మనందరికీ తెలిసిన ఒక ప్రాథమిక సత్యం. అయితే ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనిషికి కొన్ని సహస్రాబ్దాలు పట్టింది.

ప్రాచీన కాలంలో భూమి గురించి, సూర్య చంద్రుల గురించి, గ్రహాల గురించి కొన్ని విచిత్రమైన నమ్మకాలు చలామణిలో ఉండేవి. సూర్యుడు ఏ రోజు కారోజు కొత్తగా - ఓ పూవులా - ఆవిర్భవించి, అంతరిస్తూ ఉంటాడు అనుకునేవారు ఒకప్పుడు. భూమి బల్లపరుపుగా ఉంది కనుక, అంచు దాకా వెళ్తే కాలు జారి అవతల అగాథంలో పడిపోతాం అనుకునేవారు.

అలాంటి దశలో అనాక్సీమాండర్ అనే గ్రీకు తాత్వికుడు, విశ్వాన్ని ఓ పెద్ద నల్లని గోళంగా ఊహించుకున్నాడు. ఆ గోళంలో సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు వజ్రాల్లా పొదగబడి ఉన్నాయని అనుకున్నాడు. అందుకే చీకటి ఆకాశంలో కనిపించే వస్తువులన్నీ కలిసికట్టుగా ఉదయించి అస్తమిస్తున్నాయి అనుకున్నాడు. ఆకాశంలో కనిపించే ఎన్నో వస్తువులు గోళాలే అయినా భూమి మాత్రం గోళమా కాదా అన్నది తేల్చుకోలేకపోయాడు.

తరువాత ఎరొటోస్తినిస్ అనే మరో తాత్వికుడు, గణితవేత్త భూమి మీద దూర దూరంగా రెండు విభిన్న స్థానాలలో పాతిన కర్రల నీడలని ఏకకాలంలో కొలిచి భూమి వ్యాసాన్ని అంచనా వేస్తాడు. అది ఆధునిక అంచనాలకి సన్నిహితంగా ఉంది.

భూమి చదునుగా ఉంటుందన్న భయంతో ప్రాచీన నావికులు తమ భూభాగాలకి దూరంగా సముద్రంలోకి చొచ్చుకుపోయే వాళ్లు కారు. తీరం నుండి మరీ దూరం పోకుండా తీరాన్ని అనుసరిస్తూ ప్రయాణించేవారు. నేరుగా సముద్రం తలం మీదకి చొచ్చుకుపోతే భూమి అంచుకి వచ్చి ఓడలు అవతల అగాధంలో పడిపోతాయని వాళ్ల భయం. అలాంటి దశలో కొలంబస్ అనే ఓ ధీరుడు స్పెయిన్ నుండి ఇండియా కోసం గాలిస్తూ బయలుదేరుతాడు.

ఆ యాత్రలలో ఆధునిక వెస్ట్ఇండీస్‌ని, దక్షిణ అమెరికాని కనుక్కుంటాడు. భూమి గుండ్రంగా ఉందన్న నమ్మకం మీద ఆధారపడ్డ తొలి సముద్ర యాత్ర ఇదే కావచ్చు.

కొలంబస్ యాత్రలు భూమి గోళంలా ఉందని నిర్ధారించ లేకపోయాయి. ఆ నిర్ధారణ తరువాత మెగాలెన్ యాత్రల ద్వారా వచ్చింది. మూడేళ్ల పాటు సాగిన, సుదీర్ఘమైన, ప్రమాదకరమైన యాత్రలో మెగాలెన్ బృందం స్పెయిన్ నుండి బయలుదేరి భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి స్పెయిన్‌కి వచ్చింది. ఆ విజయానికి మెగాలెన్ తన ప్రాణాలతో వెల చెల్లించాడు.

ఇక ఆధునిక అంతరిక్ష యుగంలో భూమిని స్పష్టంగా దర్శించవచ్చు. ఆకాశంలో నీలి చందమామలా, గుండ్రంగా అందంగా వెలిగిపోతున్న భూమిని వ్యోమగాములు చూశారు.

భూమి గుండ్రంగా ఉందన్న అత్యంత సామాన్యమైన వైజ్ఞానిక సత్యాన్ని ఓ అద్భుత సాహస యాత్రలా వర్ణించగల శక్తి అసమాన కథకుడు అసిమోవ్‌కే ఉంది. ఆయన రాసిన "How did we find out that the earth is round?" ని డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారు తెలుగులోకి అనువదించారు. తెలుగు అనువాద పుస్తకాన్ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. (Click here to download).

కేవలం తెలుగులోకి అనువదించడమే కాకుండా, దానిని "నాటక రూపంలో హాస్య భరితంగా" అద్భుతంగా మలిచారు. ఈ నాటకం యొక్క Script file ను ఇక్కడి నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. (Click here to download).

లేదా ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది అడ్రసు నందు సంప్రదించి పుస్తకాలను కొనుగోలు చెయ్యవచ్చును.

చిరునామా:
మంచి పుస్తకం
12 – 13 – 452, వీధి నెం.1,
తార్నాక, సికింద్రాబాద్ – 500 017.


0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts