శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఓ ఈ-లర్నింగ్ విజయ గాధ

Posted by V Srinivasa Chakravarthy Sunday, February 13, 2011
ఇంటర్నెట్ చదువులు, బ్లాగ్ వ్యాసాలు మొదలైన వన్నీ నగరాల వాళ్లకే గాని, సరైన విద్యుత్ సరఫరా కూడా లేని మన పల్లెల్లో పిల్లలకి వీటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కొంత మంది వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాదనలని వమ్ము చేస్తూ బీహార్ లోని ఓ చిన్న గ్రామం నుండీ వచ్చిన వార్త....

http://timesofindia.indiatimes.com/city/patna/Ex-IITian-starts-world-class-school-in-Bihar-village/articleshow/7419365.cms

బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో, చమన్ పురా గ్రామంలో ఓ కొత్తరకమైన బడి స్థాపించబడింది. దాని పేరు చైతన్య గురుకుల్ పబ్లిక్ స్కూల్. దాన్ని స్థాపించినవాడు చంద్రకాంత్ సింగ్ అనే ఓ ఎక్స్-ఐఐటియన్. బెంగుళూర్ కి చెందిన ఈ వ్యక్తి 2009 లో బడిని స్థాపించాడు.

అంతవరకు విద్యుత్ సరఫరా కూడా లేని ఈ పల్లెలో, ఈ-లర్నింగ్ కి అవసరమైన వసతులతో ఈ కొత్త బడి ప్రత్యక్షమయ్యింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభావంతులైన టిచర్లు ఇక్కడ ఒకటి నుండీ ఎనిమిదో క్లాసు వరకు పిల్లలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్తారు. సింగరౌలీ లో ఉండే పంకజ్ కుమార్ ఫిజిక్స్ నేర్పిస్తే, యు.పి. లోని కోర్వాలో ఉండే సంజయ్ రాయ్ కెమిస్ట్రీ చెప్తాడు. అమెరికాలో ఉండే వత్స్ గణితం నెర్పిస్తాడు. కంప్యూటర్లకి కావలసిన విద్యుత్తు జెన్సెట్ల నుండి వస్తుంది.

బీహార్ కి చెందిన చంద్రకాంత్ సింగ్, తన రాష్ట్రం వాళ్లు మహారాష్ట్రలో నవనిర్మాణ్ సేన కార్యకర్తల వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి విన్నాడు. బీహార్ కి చెందిన విద్యార్థులు చదువుల కోసం ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు.

తన ఆలోచన గురించి ఐఐటి బాంబేలో తన గురువైన డా. సూర్య నారాయణకి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఓ పధకం ఆలోచించారు. అలా తయారైన పథకాన్ని మూడు వేల మంది స్నేహితులకి తెలియజేయగా, వారిలో ఎనిమిది మంది దానికి ధనసహాయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.

దేశ రాష్ట్రాలన్నిటిలోకి మన రాష్ట్రం అక్షరాస్యత విషయంలో చాలా హీన స్థితిలో ఉందన్న సంగతి మనకి తెలిసినదే. 2001 సెన్సస్ ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 60.5% (http://india.gov.in/knowindia/literacy.php). ఈ ఏడాది రావలసిన సెన్సస్ సమాచారం మరి కొన్ని నెలలలో బయటపడుతుంది. కాని కిందటి సంవత్సరం వచ్చిన కొన్ని ముందస్తు నివేదికల ప్రకారం గత దశాబ్దంలో మన రాష్ట్రంలో అక్షరాస్యత పెద్దగా పెరక్కపోవడం ఆశ్చర్యకరం.
ఐటి రంగంలో గత ఒకటి రెండు దశాబ్దాల్లో గొప్ప పురోగతి సాధించిన మన రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడడం బాధాకరం. ఐటి రంగంలో జరిగిన పురోగతిని ఆసరాగా చేసుకుని ఈ దశాబ్దం అంతాని కల్లా 90% అక్షరాస్యతని సాధించగలిగితే బావుంటుంది.

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts